పంచమ ప్రకరణము : పంచమ ప్రకరణారంభ ద్విపద
వాసిష్ఠ రామాయణము
॥పంచమ ప్రకరణము॥
॥పంచమ ప్రకరణారంభ ద్విపద॥
4207
శ్రీతారకోల్లాస -శేషాద్రివాస!
శ్రీతరిగొండ సృ-సింహ! ధూతాంహ!
4208
విన్నవించెద నది -వినుము వాల్మీకి
క్రన్నన చూడాల -కథ తెల్పఁగాను
4209
తగవిని, యాభర-ద్వాజుండు మరల
నగణిత భక్తి ని-ట్లనె “గురుస్వామి!
4210
సురుచిరాత్ముఁడు వసి-ష్టుఁడు రాఘవునకుఁ
జిరకృపన్ మఱి యేమి చెప్పె” నటంచు
4211
నడుగ భరద్వాజు -నమ్ముని చూచి
యడరిన కరుణ ని-ట్లని చెప్పఁదొడఁగె
4212
“ఆవసిష్ఠుండు రా-మావనీశ్వరుని
భావించి క్రమ్మఱఁ -బలికె ని ట్లనుచు
4213
“ధరణీశ! వినుము చి-త్తత్యాగ సరణి
వెఱిఁగి సేయందగు -నీయర్థమందు
*టీక:- చిత్తత్యాగము- అరిషడ్వర్గము, 7. ఈర్ష్య, 8. అసూయ, 9. దంభము, 10. దర్పము, 11. అహంకారము, 12. ఇచ్ఛ, 13. భక్తి, 14. శ్రద్ధ అను ‘చతుర్దశ చిత్తవృత్తులను విడిచివేయుట’
4214
ఫలితార్ధమగు కచో-పాఖ్యానమొకటి
కలదు, చెప్పెద రామ! -క్రమముగా వినుము!