పంచమ ప్రకరణము : శ్రీ మద్రామాయణ కథాసంగ్రహము
॥శ్రీ మద్రామాయణ కథాసంగ్రహము॥
4805
అంతనా శ్రీరాముఁ -డాత్మార్థ మెఱిఁగి,
వింతగాఁ దనుఁ దాను -వీక్షించుకొనుచు
4806
సలలిత విమల సు-స్వాంతుఁడై లేచి
చెలువొప్ప దశరథు -చేసెలవొంది,
4807
యారాముఁ డపుడు వి-శ్వామిత్రు వెంట
సారజ్ఞుఁడైనట్టి -సౌమిత్రితోడ
4808
శరచాపములు పూని -చని యరణ్యమునఁ
దిరుగు తాటకను మ-ర్దించి, పిమ్మటను
4809
నతివేగ మారీచుఁ -డను వానిఁ దఱిమి,
ప్రతిభ దీపింప సు-బాహునిఁ ద్రుంచి,
4810
కరుణతో గాధేయు -క్రతువు రక్షించి,
పరఁగ నహల్య శా-పంబును దీర్చి,
4811
గరళకంఠుని కార్ము-కంబు ఖండించి,
సురలు మెచ్చఁగ మహీ- సుతను వరించి,
4812
పరశురాముని బాహు -బలము నణంచి,
ధరణిజతో నయో-ధ్యాపురిఁ జేరి,
4813
మెఅయుచు సీతాస-మేతుఁడై యచట
సురుచిరలీలల -సుఖియింపుచుండె.
4814
మఱికొన్నినాళ్లకు -మంథరవలన
దురుసుగాఁ గైకకు -దుర్బుద్ధి పొడమ
4815
రామచంద్రుని మహా-రణ్య భూములకుఁ
దామించి పొమ్మన్న, -దశరథేశ్వరుని
4816
యనుమతిఁ గైకొని -యతిశాంతుఁ డగుచు
జనకజా సహితుఁడై -సౌమిత్రి తోడ
4817
నారాముఁడడవుల -కరుగగా, సీత
నారావణాసురుఁ -డపహరింపఁగను
4818
శ్రీరాముఁ డచ్చటఁ -జింతించి, పంపఁ
జేరి, సుగ్రీవుతో -స్నేహంబు చేసి,
4819
వనచరోత్తముఁడైన -వాలినిఁ ద్రుంచి,
యినసూనునకు రాజ్య-మిచ్చి, యంగదుని
4820
యువరాజుగాఁ జేసి -యుంచి, యామీఁదఁ
బవనాత్మజుని భక్తి -భావన మెచ్చి.
4821
యతని చేతికి సీత -కానవా లిచ్చి,
ప్రతిభతోఁ బంప, న -ప్పవననందనుఁడు
4822
లవణాబ్ది లంఘించి -లంకలోఁ జొచ్చి
యవనీతనూభవ -నచ్చోటఁ గాంచి,
4823
శ్రీరామచంద్రుఁ డి-చ్చిన యుంగరంబు
గౌరవంబుగ సీత -కరములం దుంచి,
4824
చెచ్చెర సీత యి-చ్చిన మానికంబు
నచ్చుగాఁ గైకొని -యందుండి కదలి.
4825
వనపాలకుల నొంచి, -వనము మాయించి ,
ఘనశూరుఁడైన య-క్షకుమారు నణఁచి.
4826
లంకాధిపతిని ని -ర్లక్ష్యంబు చేసి.
లంకఁగ్రక్కునఁ గాల్చి, -లవణాబ్ధిఁ గడచి,
4827
రామున కా శిరో -రత్నంబు నిచ్చె;
నామీఁద రఘువరుఁ -డఖిలవానరులఁ
4828
గూడితోయధిని మి-క్కుటముగాఁ గట్టి,
పోడిమి లంకకుఁ -బోయి శౌర్యమునఁ
4829
గడఁగి రావణకుంభ- కర్ణాదులైన
చెడుగు రక్కసులఁ గూ-ల్చివిభీషణునకుఁ
4830
బనిబూని లంకలోఁ -బట్టంబుఁ గట్టి,
జనకజన్ దోడ్కొని -సౌమిత్రతోడ ,
4831
వానరాదులతోడ -వరపుష్పకంబు
పైనెక్కి, సాకేత -పట్టణంబునకు
4832
వరశక్తి దీపింప -వచ్చి, లక్ష్మణుఁడు,
భరతశత్రుఘ్నులు -పవననందనుఁడు
4833
తనుఁజేరి కొలువగా, -దగిన వేడుకల
మొనసి వసిష్ఠాది -మునులకు మ్రొక్కి,
4834
సీతతోఁ బట్టాభి-షిక్తుఁడై, సురలు
ఖ్యాతిగాఁ బొగడ, ను-త్కంఠ దీపింప,
4835
గురుతరకల్యాణ -గుణగణుం డగుచుఁ
బరమాత్ముఁడై, తాను -భావ మేమఱక
4836
పరిపూర్ణ భావసం-పన్నుఁడై ప్రజలఁ,
బరమ శాంతాత్ముఁడై -పాలింపుచుండె.
4837
అనిభరద్వాజ సం-యమికి వాల్మీకి
ఘనతరజ్ఞాన యో-గప్రకారంబు
4838
వినిపింప, నంతయు-విని భరధ్వాజుఁ
డనఘుఁడై వాల్మీకి -కంజలిఁజేసి,
4839
కొనియాడి యచ్చట -గురుభక్తి మెఱయ,
ననుపమ విజ్ఞాని-యైశాంతిఁ బొంది,
4840
శమదమ ప్రముఖ భా-స్వర సద్గుణముల
నమర జీవన్ముక్తుఁ డగుచు సుఖించి.