పంచమ ప్రకరణము : ముని వాద్యోపాఖ్యానము
॥ముని వ్యాధోపాఖానము॥
4479
ఒక్కకాననములో -నొక్క కిరాతుఁ
డొక్కబాణముఁబూని -యొక్క మృగంబు
4480
పైనేయఁగా, నేటు -పడి పోయె మృగము;
దానివెన్నంటి య-త్తఱి బర్వువాఱి
4481
వ్యాధుఁడయ్యాశతో -నరిగి యొక్కెడను
బోధనిమగ్నుఁడై -పూర్ణుఁడై యున్న
4482
మౌనినీక్షించి “యా-మార్గంబునందుఁ
దానునాచే నొచ్చి -తరలిన మృగము
4483
వచ్చెనే! యనఁగ న -వ్వరముని వాని
నచ్చెరువుగఁ జూచి -యనియె నిట్లనుచు
4484
“సర్వసమత్వ భా-స్వరనిష్ఠఁ బూని
నిర్వాణపదమందు -నిలిచి యుండెదను.
4485
ఏనునీ మృగము పో-యినజాడ నెఱుఁగ
బోనిషాదుఁడ! “యనెఁ -బూర్ణుఁడై నట్టి
4486
మునివాక్యముల కర్ధము- నెఱుంగ కతఁడు
తనయిచ్చ నరిగె; నత్త-పసి యందుండె.”
4487
“ఎందుకీకథ, జెప్పు-టెఱిఁగింపు” డనిన
ముందర సరభసం-బుగఁ బోవుచున్న
4488
మెకమునే చూడక -మిన్నంటియున్న
యకలంక తుర్య సౌ-ఖ్యంబిది యంచుఁ
4489
దెలియఁ జెప్పితి, నిది -తెలిసి యందున్న
చెలఁగు తుర్యము నభ్య-సింపుచు నుండు!
4490
మిట్టిప్రశాంతాత్ము -లెందున్నఁగాని
గట్టిగా ముక్తులు -గాఁజూడు” మనుచుఁ
4491
గ్రమముగా వ్యాధుని -కథ వినిపింప,
నమలుఁడై శ్రీరాముఁ -డతని వీక్షించి
4492
“మౌనీంద్ర! యిట్టి సమాధి నే రీతిఁ ,
బూనుచు నభ్యసిం-పుదు రార్యు” లనిన
4493
వినియమ్మునీంద్రుండు -విజయరాఘవునిఁ
గనియిట్టులనియె “నో కాకుత్స్థతిలక!